YSRCPకి మరో షాక్ తగులనుంది. మాజీ హోంమంత్రి, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వైసీపీ కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె జనసేనలో చేరే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఆమె తన భర్త దయాసాగర్తో కలిసి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో చర్చలు జరిపారిపినట్లు సమాచారం. ప్రస్తుతం నాగబాబు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే సుచరిత జనసేనలో చేరతారని తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో సుచరిత రాజకీయ అడుగులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.