నూతన్నాయుడుపై ఆరు కేసులు నమోదు
విశాఖ శిరోముండనం కేసులో అనకాపల్లి సబ్జైలు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు నూతన్నాయుడును..
విశాఖ శిరోముండనం కేసులో అనకాపల్లి సబ్జైలు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు నూతన్నాయుడును తరలించారు పోలీసులు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మొత్తం ఆరు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే గాజువాక,కంచరపాలెం, మహారాణిపేట పీఎస్లలో కేసులు నమోదు అయింది. నూతన్నాయుడు భార్య మధుప్రియ, తన వద్ద పనిచేసే ఏడుగురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. శిరోముండనం కేసుతో సహా పలు నేరాలకుగాను నూతన్నాయుడిపై రౌడీషీట్ తెరవనున్నారు పోలీసులు.