ప్రభుత్వం, ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సింహాలు మాయం: సోము వీర్రాజు

Update: 2020-09-16 10:04 GMT

దుర్గగుడి రథం సింహాల మాయంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. అమ్మవారి ఆలయంలో రథానికి అధిక ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రభుత్వం, ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే సింహాలు మాయమయ్యాయని విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Tags:    

Similar News