somu veerraju : జగన్ ప్రభుత్వం తన విధానం మార్చుకోవాలి : సోము వీర్రాజు
somu veerraju : జగన్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
జగన్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ వ్యవస్థాపకలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా విజయనగరం బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి అవకాశాలు ఉన్న పరిశ్రమలపై జగన్ దృష్టి పెట్టలేదన్న ఆయన.. ఈ విషయంలో కేంద్రం సాయం చేస్తామన్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు.