ఎంపీ రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు..

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వైసీపీ ఎంపీ రఘురామని తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-05-17 08:46 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ రఘురామని తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజే ఆయనని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని చెప్పింది. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆసుపత్రిలోనే రఘురామ ఉంటారని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు వీడియోగ్రఫీ చేసి కోర్టుకు సమర్పించాలని సుప్రీం తెలిపింది. రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలనీ, రఘురామ మెడికల్ రిపోర్టును తెలంగాణా సీజే సుప్రీంకోర్టుకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News