Chandrababu : ఏపీ సీఎస్కు చంద్రబాబు లేఖ..!
Chandrababu : కుప్పం సెగ్మెంట్ పరిధిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు.;
Chandrababu (tv5news.in)
Chandrababu : ఏపీ సీఎస్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం సెగ్మెంట్ పరిధిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. కుప్పంలో అక్రమ మైనింగ్పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను జత చేశారు.
గ్రానైట్ అక్రమ మైనింగ్పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలన్నారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఎన్జీటీ నిర్ధారించిందని.. అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలని ఎన్జీటీ ఆదేశించిందన్నారు.
ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలన్నారు.