ఆ సమయంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం : పట్టాబి
సలాం కటుంబం ఆత్మహత్య ఘటనలో పోలీసుల తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి అన్నారు టీడీపీ నేత పట్టాబి. సూర్యాస్తమయం అయిన తరువాత మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిండం నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. ముస్లి సంప్రదాయాలకు విరుద్ధంగా అర్థరాత్రి మృతదేహాలను ఎందుకు ఖననం చేశారని నిలదీశారు. ఒకే గోతిలో ఇద్దరి చొప్పున ఖననం చేసి వారి గౌరవానికి భంగం కలిగించడం దారుణమన్నారు. సలాం కేసుపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు పట్టాభి.