ఏడో తరగతి ఫాస్‌ కాని కొడాలినాని, ఐఏఎస్‌ చదివిన ఎన్నికల కమిషనర్‌ను దూషించడమా? : పిల్లి మాణిక్యరావు

Update: 2020-11-18 12:52 GMT

భయంతోనే వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లడం లేదంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు. ఏడో తరగతి ఫాస్‌ కాని కొడాలినాని, ఐఏఎస్‌ చదివిన ఎన్నికల కమిషనర్‌ను దూషించడం ఏంటని ప్రశ్నించారాయన. చంద్రబాబు చెబితే, నిమ్మగడ్డ పనిచేస్తాడని చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రజాప్రతినిధి అనేవాడు.. ప్రజల్లో వెళ్లడానికి, ఎన్నికలకు వెనకాడుతున్నాడంటే.. అతనకి ప్రజలంటే భయం ఉండబట్టేనన్నారు మాణిక్యరావు.

Tags:    

Similar News