ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పవన్ కల్యాణ్ ఫొటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వాదనల సందర్భంగా.. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని పేర్కొంటూ పిల్ను డిస్మిస్ చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని సూచించింది.