TIRUMALA: తిరుమలకు పోటెత్తిన భక్తి జన సంద్రం

కన్నులపండువగా గరుడ వాహనసేవ

Update: 2025-09-29 05:00 GMT

తి­రు­మ­ల­లో శ్రీ­వా­రి బ్ర­హ్మో­త్స­వా­లు అం­గ­రంగ వై­భ­వం­గా జరు­గు­తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో తి­రు­మ­ల­లో భక్తుల రద్దీ భా­రీ­గా పె­రి­గిం­ది. తి­రు­మ­ల్లో­ని రహ­దా­రు­లు, క్యూ­లై­న్లు, కం­పా­ర్ట్‌­మెం­ట్లు, గ్యా­ల­రీ­లు అన్నీ భక్తు­ల­తో నిం­డి­పో­యా­యి. ఈ నే­ప­థ్యం­లో తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. అలి­పి­రి నుం­చి తి­రు­మ­ల­కు వచ్చే రెం­డో ఘాట్ రో­డ్డు­లో కే­వ­లం బస్సు­ల­ను మా­త్ర­మే అను­మ­తిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. అలా­గే తి­రు­మల మొ­ద­టి ఘాట్ రో­డ్డు­లో మా­త్రం ద్వి­చ­క్ర వా­హ­నా­ల­కు మి­న­హా అన్ని వా­హ­నా­ల­కు అను­మ­తి ఇచ్చిం­ది. అయి­తే ఘాట్ రో­డ్డు­లో బస్సు­ల­ను మా­త్ర­మే అను­మ­తి ఇస్తుం­డ­డం­తో.. బస్సు­ల్లో­కి ఎక్కేం­దు­కు భక్తు­లు ఎగ­బ­డు­తు­న్నా­రు. సె­ప్టెం­బ­ర్ 23వ తేదీ నుం­చి శ్రీ­వా­రి సా­ల­క­ట్ల బ్ర­హ్మో­త్స­వా­లు ప్రా­రం­భ­మై­నా­యి. ఈ నే­ప­థ్యం­లో ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న శ్రీ­వా­రి భక్తు­లు.. స్వా­మి వా­రి­ని దర్శిం­చు­కు­నేం­దు­కు తి­రు­మ­ల­కు పో­టె­త్తా­రు. దీం­తో భక్తు­ల­కు ఎటు­వం­టి అసౌ­క­ర్యం కల­గ­కుం­డా టీ­టీ­డీ ప్ర­త్యేక చర్య­లు చే­ప­ట్టిం­ది. గరుడవాహన సేవ నేపథ్యంలో మాడవీధులు గోవింద నామస్మరణతో నిండిపోయాయి. ఇప్పటికే గ్యాలరీలలో లక్షల సంఖ్యలో భక్తులు చేరారు. టిటిడి అంచనా ప్రకారం, ఈసారి గరుడ వాహన సేవలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా.

కన్నులపండువగా గరుడ వాహనసేవ

తి­రు­మల బ్ర­హ్మో­త్స­వా­ల్లో భా­గం­గా ఆది­వా­రం సా­యం­త్రం గరుడ వా­హ­న­సేవ ని­ర్వ­హిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో వా­హ­నా­ల్లో పె­ద్ద సం­ఖ్య­లో భక్తు­లు రా­వ­డం­తో అలి­పి­రి­లో భారీ రద్దీ నె­ల­కొం­ది. అలి­పి­రి టో­ల్‌­గే­ట్‌ వద్ద వా­హ­నా­ల­ను క్షు­ణ్ణం­గా తని­ఖీ చే­సిన అనం­త­రం అను­మ­తి­స్తు­న్నా­రు. తి­రు­మ­ల­లో భక్తు­లు రద్దీ అధి­కం­గా ఉంది. శ్రీ­ని­వా­సు­డి గరుడ సే­వ­ను కను­లా­రా వీ­క్షిం­చేం­దు­కు శని­వా­రం రా­త్రి నుం­చే భక్తు­లు ని­రీ­క్షి­స్తు­న్నా­రు. ఆది­వా­రం సా­యం­త్రం గరుడ వా­హ­న­సే­వ­ను దర్శిం­చు­కు­న్నా­రు. గ్యా­ల­రీ­ల్లో ఉన్న భక్తు­ల­కు టీ­టీ­డీ సి­బ్బం­ది పాలు, బి­స్కె­ట్లు అం­ద­జే­శా­రు. 4 మాడ వీ­ధు­ల్లో పర్య­వే­క్ష­ణ­కు 64 మంది ప్ర­త్యేక సి­బ్బం­ది, 14 మంది ప్ర­త్యేక అధి­కా­రు­ల­ను టీ­టీ­డీ ని­య­మిం­చిం­ది. గరుడ వా­హ­నం­పై స్వా­మి­వా­రి వి­హా­రం అత్యంత శో­భా­య­మా­నం­గా జరి­గిం­ది. స్వా­మి వై­భ­వా­న్ని చు­ట్టూ మా­ల­లు, లక్ష్మీ­కా­సుల మా­ల­లు, పచ్చల హారం అలం­క­రిం­చా­రు. భక్తు­లు గరు­డ­సే­వ­లో పా­ల్గొ­ని దా­స్య­భ­క్తి పట్ల స్వా­మి దయను పొం­దా­రు. పౌ­రా­ణి­కం­గా, 108 వై­ష్ణవ ది­వ్య­దే­శా­ల్లో గరు­డ­సే­వ­కు అత్యంత ప్రా­ధా­న్యత ఉంది. గరు­డు­ని దర్శిం­చే­వా­రి­కి సర్వ­పా­పా­లు తొ­ల­గి­పో­తా­య­ని, జ్ఞా­న­వై­రా­గ్యా­ని­కి దారి ఏర్ప­డు­తుం­ద­ని భక్తు­లు వి­శ్వ­సి­స్తా­రు. తిరుమలలో సాయంత్రం 6.30 గంటల సమయంలో గరుడ సేవ మొదలు కాగా.. లక్షలాది మంది భక్తులు రాగా.. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. గరుడ సేవ సందర్భంగా మలయప్పస్వామివారికి మకరకంఠి, లక్ష్మీహారాన్ని అలంకరించారు.

Tags:    

Similar News