హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హిందుత్వానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. దుర్గ గుడిలో ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉండగా. సింహం బొమ్మలు ఎలా మాయమయ్యాయని ఆయన ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి బీజేపీలో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా హిందువుల కోసం ఉద్యమాలు చేసి.. ఇప్పుడు హిందువులకు అన్యాయం చేస్తే చరిత్ర హీనుడిగా మిలిగిపోతారని... రమేష్ నాయుడు హెచ్చరించారు.