TTD: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరు గిరులు

రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం....నేటి నుంచి ఉచిత దర్శనాలు

Update: 2026-01-02 05:30 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 30న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఈ-డిప్‌ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అనుమతించారు. వారిని శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ ప్రవేశ మార్గాల నుంచి టోకెన్లను స్కాన్‌ చేసి దర్శన క్యూలైన్లలోకి అనుమతించారు. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు 40,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకు 1,77,337 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ-డిప్‌ టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు వీలుగా అక్టోపస్‌ భవనం పాయింట్ నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుపతిలో రద్దీ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఈనెల 8 వరకు కొనసాగుతాయి.

నేటి నుంచి ఉచిత దర్శనాలు

తి­రు­మల శ్రీ­వా­రి వై­కుంఠ ద్వార దర్శ­నా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. ఎల­క్ట్రా­ని­క్ డి­ప్‌ ద్వా­రా టి­కె­ట్ పొం­దిన భక్తు­లు ప్ర­స్తు­తం స్వా­మి దర్శిం­చు­కు­న్నా­రు. డి­సెం­బ­ర్ 30 నుం­చి ప్రా­రం­భ­మైన ఈ దర్శ­నా­లు కొ­త్త సం­వ­త్స­రం­లో­నూ కొ­న­సా­గు­తు­న్నా­యి. ఉదయం నుం­చే భక్తు­లు భా­రీ­గా తర­లి­వ­చ్చి వా­రి­కి కే­టా­యిం­చిన సమ­యం­లో వై­కుంఠ ద్వా­రం ద్వా­రా వెం­క­టే­శ్వ­రు­డి­ని దర్శిం­చు­కు­ని తరిం­చి­పో­తు­న్నా­రు. నేటి నుం­చి టో­కె­న్లు లే­క­పో­యి­నా భక్తు­ల­కు స్వా­మి వా­రి­ని దర్శిం­చే ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. దీం­తో భక్తు­లు భా­రీ­గా వచ్చే అవ­కా­శం ఉన్న­ట్లు అధి­కా­రు­లు అం­చ­నా వే­శా­రు. ఈ మే­ర­కు అన్ని ఏర్పా­ట్లు చే­శా­రు.

రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం

గత ఏడా­ది తి­రు­మ­ల­లో లడ్డూ ప్ర­సా­దా­ల­ను రి­కా­ర్డు స్థా­యి­లో వి­క్ర­యిం­చా­రు. 2024తో పో­లి­స్తే 2025లో 10 శాతం అద­నం­గా భక్తు­ల­కు వి­క్ర­యిం­చి­న­ట్లు తి­తి­దే తె­లి­పిం­ది. 2024లో 12.15 కో­ట్ల లడ్డూ­లు అమ్మ­గా.. 2025లో ఆ సం­ఖ్య 13.52 కో­ట్ల­కు చే­రి­న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. గత దశా­బ్ద­కా­లం­లో ఎన్న­డూ లే­ని­వి­ధం­గా డి­సెం­బ­ర్‌ 27న 5.13 లక్షల లడ్డూ­ల­ను భక్తు­లు కొ­ను­గో­లు చే­శా­ర­ని పే­ర్కొం­ది.  ఏడా­ది­గా ప్ర­తి­రో­జూ 4 లక్షల వరకు లడ్డూ­ల­ను తయా­రు­చే­స్తు­న్న­ట్లు తి­తి­దే తె­లి­పిం­ది. ము­ఖ్య­మైన రో­జు­ల్లో 8 లక్షల నుం­చి 10 లక్షల లడ్డూ­లు భక్తు­ల­కు అం­దు­బా­టు­లో ఉం­చు­తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. శ్రీ­వా­రి పో­టు­లో 700 మంది సి­బ్బం­ది రెం­డు షి­ఫ్టు­ల్లో శ్ర­మి­స్తూ నియమ, ని­ష్ట­ల­తో ప్ర­సా­దా­ల­ను తయా­రు­చే­స్తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. ఇటీ­వల కా­లం­లో లడ్డూ నా­ణ్యత, రుచి పె­ర­గ­డం­పై భక్తు­లు సం­తో­షం వ్య­క్తం చే­స్తు­న్న­ట్లు తి­తి­దే పే­ర్కొం­ది.

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కుటుంబం


తె­లం­గాణ ఉప ము­ఖ్య­మం­త్రి మల్లు భట్టి వి­క్ర­మా­ర్క నూతన సం­వ­త్సర ప్రా­రం­భం సం­ద­ర్భం­గా తి­రు­మల శ్రీ వేం­క­టే­శ్వర స్వా­మి­ని దర్శిం­చు­కు­న్నా­రు. కు­టుంబ సభ్యు­ల­తో కలి­సి ఆల­యా­ని­కి చే­రు­కు­న్న ఆయ­న­కు టీ­టీ­డీ అధి­కా­రు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. అనం­త­రం వై­కుంఠ ద్వా­రం ద్వా­రా శ్రీ­వా­రి­ని దర్శిం­చు­కు­ని మొ­క్కు­లు చె­ల్లిం­చు­కు­న్నా­రు. దర్శ­నా­నం­త­రం రం­గ­నా­య­కుల మం­డ­పం­లో వేద పం­డి­తు­లు ఆయ­న­కు ఆశీ­ర్వ­చ­నం పల­క­గా, అధి­కా­రు­లు స్వా­మి­వా­రి తీ­ర్థ­ప్ర­సా­దా­ల­ను అం­ద­జే­శా­రు.రెం­డు తె­లు­గు రా­ష్ట్రా­లు సు­భి­క్షం­గా, సం­తో­షం­గా ఉం­డా­ల­ని, ఆర్థి­కం­గా బలం­గా అభి­వృ­ద్ధి చెం­దా­ల­ని స్వా­మి­వా­రి­ని ప్రా­ర్ధిం­చి­న­ట్లు తె­లి­పా­రు. ము­ఖ్యం­గా తె­లం­గాణ రా­ష్ట్రం సర్వ­తో­ము­ఖా­భి­వృ­ద్ధి సా­ధిం­చా­ల­ని, ప్ర­జల ఆశ­యా­ల­కు అను­గు­ణం­గా ప్ర­భు­త్వం మరి­న్ని సం­క్షేమ పథ­కా­ల­ను అమలు చే­స్తూ ప్ర­గ­తి­ప­థం­లో ముం­దు­కు సా­గా­ల­ని ఆయన ఆకాం­క్షిం­చా­రు.

Tags:    

Similar News