AP : హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్

Update: 2024-08-14 10:30 GMT

వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది అరెస్ట్ కాగా వంశీ ఏ71గా ఉన్నారు. ఆయనపై దాడి కేసుతో పాటు హత్యాయత్నం అభియోగాలున్నాయి. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ మీదే వరుసగా రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు.. రెండోసారి గెలిచాక టీడీపీని వదిలి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్‌, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఓ దశలో శఅతిమించి నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడటం వల్లే వంశీ పేరు హిట్‌ లిస్ట్‌లో చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News