డీజీపీ గౌతమ్ సవాంగ్కు వర్ల రామయ్య లేఖ!
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్పై కేసు పెట్టి ఆలయాలపై దాడులు చేసిందెవరో తేల్చాలని లేఖ ద్వారా కోరారు.;
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్పై కేసు పెట్టి ఆలయాలపై దాడులు చేసిందెవరో తేల్చాలని లేఖ ద్వారా కోరారు. అమ్మఒడి సభలో సీఎం జగన్ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని, దాడులు చేసిందెవరో తనకు తెలుసన్నారని గుర్తు చేశారు. రథాలు తగులబెట్టినవారే రధయాత్రలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారన్నారు. వెంటనే సీఎంకు నోటీసులిచ్చి ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. లేఖతో పాటు జగన్ ప్రసంగించిన వీడియోను కూడా వర్ల రామయ్య జత చేశారు.