టీటీడీలో మరో వివాదం..!

టీటీడీలో మరో వివాదం నెలకొంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్ఛకులు వేణుగోపాల దీక్షితులు తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2021-05-04 07:30 GMT

టీటీడీలో మరో వివాదం నెలకొంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్ఛకులు వేణుగోపాల దీక్షితులు తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. పిల్ ను స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులను జారీ చేసింది. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా.. తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని వేణుగోపాల దీక్షితులు హైకోర్టులో సవాలు చేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ ప్రభుత్వం, టీటీడీపై కోర్టును ఆశ్రయించడంతో ఇది సంచలనంగా మారింది. 

Tags:    

Similar News