vishaka: విధ్వంసం నుంచి వికాసం దిశగా విశాఖ

మరో ముంబైగా విశాఖను తీర్చిదిద్దే వ్యూహాలు;

Update: 2025-06-21 04:00 GMT

ప్ర­కృ­తి వన­రు­ల­కు వి­శా­ఖ­ప­ట్నం ఆల­వా­లం. ఈ తీర నగ­రా­న్ని దేశ ఆర్థిక రా­జ­ధా­ని ముం­బై­కు దీ­టు­గా అభి­వృ­ద్ధి చే­సేం­దు­కు కూ­ట­మి ప్ర­భు­త్వం ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తోం­ది. అం­దు­కే అం­ది­వ­చ్చిన ప్ర­తీ అవ­కా­శా­న్ని వి­ని­యో­గిం­చు­కుం­టోం­ది. జా­తీయ, అం­త­ర్జా­తీయ స్థా­యి కా­ర్య­క్ర­మా­ల­కు వై­జా­గ్‌­ను వే­ది­క­గా ఎం­చు­కుం­టోం­ది. ఇప్పు­డు కూడా కూ­ట­మి ప్ర­భు­త్వం అం­త­ర్జా­తీయ యోగ ది­నో­త్స­వా­ని­కి వి­శా­ఖ­నే కేం­ద్రం­గా చే­సు­కు­న్నా­రు. దీం­తో మరో­సా­రి అం­త­ర్జా­తీయ వే­ది­క­పై వి­శాఖ పేరు మా­ర్మో­గు­తోం­ది.ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో తల­స­రి ఆదా­యం అత్య­ధి­కం­గా ఉన్న నగరం వి­శాఖ.

ప్ర­త్యేక దృ­ష్టి...

జగ­న్‌ 5 ఏళ్ళ పా­ల­న­లో ఓసా­రి మూడు రా­జ­ధా­ను­ల­ని మరో­సా­రి వి­శాఖ రా­జ­ధా­ని అంటూ రక­ర­కాల ప్ర­క­ట­న­లు చే­శా­రు. కానీ సీఎం చం­ద్ర­బా­బు నే­తృ­త్వం­లో­ని కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత వి­శా­ఖ­పై ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చిం­ది. ము­ఖ్య­మం­త్రి­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టిన వెం­ట­నే వి­శా­ఖ­లో పర్య­టిం­చి నగ­రా­భి­వృ­ద్ధి­పై జి­ల్లా అధి­కా­రు­ల­తో చర్చిం­చి, ప్ర­ణా­ళి­క­లు సి­ద్దం చే­శా­రు. వి­శాఖ నగ­రా­ని­కి అతి సమీ­పం­లో వి­జ­య­న­గ­రం, శ్రీ­కా­కు­ళం జి­ల్లాల మధ్య భో­గా­పు­రం వద్ద అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం ని­ర్మాణ పను­ల­ను వే­గ­వం­తం చే­శా­రు. వి­మా­నా­శ్రయ సౌ­క­ర్యా­లు కల్పిం­చేం­దు­కు మరో 500 ఎక­రా­లు కే­టా­యిం­చా­రు. 2026 ఏప్రి­ల్ నా­టి­క­ల్లా అక్క­డి నుం­చి వి­మాన సే­వ­లు మొ­ద­ల­వ్వా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కొ­ని రే­యిం­బ­వ­ళ్ళు పను­లు జరు­గు­తు­న్నా­యి. ఓ పక్క చకచకా విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతుంటే మరోపక్క దానిని కలుపుతూ 15 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు.

విశాఖ.. బృహత్తర ప్రణాళిక

రహ­దా­రు­లు­గా అభి­వృ­ద్ధి చే­సేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తు­న్నా­రు. వి­శాఖ మె­ట్రో ని­ర్మాణ పను­లు మొ­ద­లు­పె­ట్టేం­దు­కు కూడా ము­హూ­ర్తం ఖరా­రు చే­సే­శా­రు. అక్టో­బ­ర్ నుం­చి పను­లు మొ­ద­లు­పె­ట్టి మూ­డే­ళ్ళ­లో­గా పూ­ర్తి­చే­యా­ల­నే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­మ­ని పు­ర­పా­లక శాఖ మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. వి­శాఖ నగ­రం­లో ట్రా­ఫి­క్ సమ­స్య­ల­కు పరి­ష్కా­రం­గా వా­హ­నా­లు, మె­ట్రో రై­ళ్ళు ప్ర­యా­ణిం­చే­లా డబు­ల్ డె­క్క­ర్ ఎలి­వే­ట­డ్ మె­ట్రో కా­రి­డా­ర్ ని­ర్మిం­చ­బో­తు­న్న­ట్లు మం­త్రి నా­రా­యణ చె­ప్పా­రు. వి­శాఖ కేం­ద్రం­గా ఉత్త­రాం­ధ్ర అభి­వృ­ద్ధి కోసం ఎక­నా­మి­క్‌ హబ్‌ అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు­నా­యు­డు పే­ర్కొ­న్నా­రు. ఈ మే­ర­కు రి­పో­ర్ట్‌ తయా­రైం­ద­న్నా­రు. కా­కి­నాడ పో­ర్టు నుం­చి మూ­ల­పేట పో­ర్టు వరకూ గల ప్రాం­తా­న్ని అభి­వృ­ద్ధి చే­స్తే బె­స్ట్‌ ఎక­మి­నా­మి­క్‌ కా­రి­డా­ర్‌­గా ని­లు­స్తుం­ద­న్నా­రు. ప్రపంచంలోని డేటాను విశాఖకు తెచ్చి ఏఐ సాయంతో విశ్లేషించనున్నట్టు తెలిపారు. ఇందుకు సింగపూర్‌ నుంచి విశాఖకు సముద్ర మార్గంలో కేబుల్‌ వేయనున్నట్టు చంద్రబాబునాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంటు వస్తోందన్నారు.

Tags:    

Similar News