Andhra Pradesh: ఏపీ రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మళ్లీ టంగ్ స్లిప్
Andhra Pradesh: ఏపీ రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.;
Andhra Pradesh: ఏపీ రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. విశాఖ రాజధాని కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిపై విచారణ సుప్రీంకోర్టులో ఉండగా మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. అలాగే మూడు రాజధానులపైనా మంత్రి మాటల్లో స్పష్టత లేదు. విశాఖలో రాజధాని పూర్తిస్థాయినా? అడిగేసరికి నాలుక కరుచుకుని ఏదో సమాధానం చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేసారు. పరిపాలనా, అభివృద్ధి వికేంద్రకరణ తమ లక్ష్యమన్నారు. అంతకుముందు జి-20 సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన పనులను మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు.