ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబసభ్యులను పరామర్శించిన శ్రవణ్.. ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసాను ఇచ్చారు. కుటుంబసభ్యుల ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.