YCP: బస్సు ప్రమాదంపైనా వైసీపీ దుష్ప్రచారం

మండిపడిన నారా లోకేశ్... స్పష్టత ఇచ్చిన సర్కార్

Update: 2025-10-27 03:30 GMT

కర్నూ­లు జి­ల్లా­లో జరి­గిన ఘోర బస్సు ప్ర­మా­దం­పై కొం­ద­రు పని­గ­ట్టు­కొ­ని చే­స్తో­న్న దు­ష్ప్ర­చా­రా­న్ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం ఖం­డిం­చిం­ది. వా­స్త­వా­ల­ను వి­స్మ­రి­స్తూ ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా దు­ష్ప్ర­చా­రం చే­స్తే చట్ట­ప్ర­కా­రం చర్య­లు తప్ప­వ­ని హె­చ్చ­రిం­చిం­ది. ఈ మే­ర­కు ఏపీ ప్ర­భు­త్వ ఫ్యా­క్ట్‌­చె­క్‌ వి­భా­గం ‘ఎక్స్‌’లో పో­స్టు పె­ట్టిం­ది. ‘‘బస్సు ప్ర­మా­దం ఘట­న­పై సా­క్షి పత్రి­క­లో, వై­సీ­పీ సో­ష­ల్ మీ­డి­యా­లో చే­స్తు­న్న తప్పు­డు ప్ర­చా­రా­న్ని తీ­వ్రం­గా ఆక్షే­పి­స్తు­న్నాం. రా­ష్ట్రం­లో బె­ల్ట్ షా­పు­లు పె­రి­గి పో­యా­య­ని, బస్సు ప్ర­మా­దా­ని­కి కా­ర­ణ­మైన ద్వి­చ­క్ర వా­హ­న­దా­రు­డు బె­ల్ట్ షా­పు­ల్లో మద్యం కొ­ను­గో­లు చేసి తా­గ­డం వల్లే ప్ర­మా­దం జరి­గిం­ద­ని చే­స్తు­న్న ప్ర­చా­రం అవా­స్త­వం. అతడు పె­ద్ద­టే­కూ­రు గ్రా­మం­లో­ని లై­సె­న్స్డ్ రి­టై­ల్ మద్యం దు­కా­ణం­లో రా­త్రి 7 గం­ట­ల­కు ఒక­సా­రి, రా­త్రి 8.25కు మరొ­క­సా­రి మద్యం కొ­ను­గో­లు చే­సి­న­ట్లు సీ­సీ­కె­మె­రాల ఆధా­రం­గా వె­ల్ల­డైం­ది. ప్ర­మా­దం జరి­గిం­ది ’’ అని పే­ర్కొం­ది.

బ్లూ బ్యాచ్.. సమాజానికి ప్రమాదకరం: లోకేశ్

ఫేక్ ప్ర­చా­రా­ల­తో ప్ర­జ­ల­ను మభ్య­పె­డు­తూ, తప్పు­డు ప్ర­చా­రా­లు చే­స్తు­న్న వా­రి­పై తక్ష­ణ­మే చర్య­లు తీ­సు­కో­వా­ల­ని మం­త్రి నారా లో­కే­శ్‌ పో­లీ­సు­ల­ను ఆదే­శిం­చా­రు. తప్పు­డు ప్ర­చా­రం ఆధా­రం­గా రా­జ­కీ­యం చే­ద్దా­మ­ను­కుం­టు­న్న ‘బ్లూ బ్యా­చ్’ సమా­జా­ని­కి ప్ర­మా­ద­క­రం­గా మా­రిం­ద­ని ధ్వ­జ­మె­త్తా­రు. పక్క రా­ష్ట్రం­లో­ని ఓ గు­రు­కుల పా­ఠ­శా­ల­లో 2023 నాటి పరి­స్థి­తి­కి సం­బం­ధిం­చిన వీ­డి­యో­ను తా­జా­గా అర­కు­లో జరి­గి­న­ట్లు ఒక కథనం రా­శా­ర­న్నా­రు. దీ­న్ని వై­కా­పా అను­బంధ సో­ష­ల్ మీ­డి­యా­లో వి­స్తృ­తం­గా ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. ఇదే వా­ర్త, వీ­డి­యో­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం తర­పున గతం­లో ‘ఫ్యా­క్ట్ చెక్’లో సం­పూ­ర్ణ వి­వ­రా­ల­తో సమా­చా­రం అం­దిం­చి­న­ట్లు చె­ప్పా­రు. అయి­నా మళ్లీ అదే వీ­డి­యో­తో తా­జా­గా తప్పు­డు ప్ర­చా­రం ప్రా­రం­భిం­చా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. తరచూ నే­రా­ల­కు పా­ల్ప­డే­వా­రి­ని ‘హ్యా­బి­ట్యు­వ­ల్ అఫెం­డ­ర్స్’ అం­టా­ర­ని గు­ర్తు­చే­శా­రు. అం­దు­కే అది ఒక రా­జ­కీయ పా­ర్టీ­నా ‘హ్యా­బి­ట్యు­వ­ల్ అఫెం­డ­ర్స్’ ము­ఠా­నా అనే అను­మా­నం వస్తుం­ద­ని దు­య్య­బ­ట్టా­రు. ఈ అస­త్య ప్ర­చా­రా­న్ని ప్ర­జ­లె­వ­రూ నమ్మ­వ­ద్ద­ని వి­జ్ఙ­ప్తి చే­శా­రు. మరోవైపు నారా లోకేశ్ తన ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. నాలుగు నగరాల్లో సాగిన ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో ఫలవంతంగా సాగిందని, త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

శివశంకర్‌పై ఎర్రిస్వామి ఫిర్యాదు

కర్నూ­లు ప్ర­మాద ఘట­న­లో మర­ణిం­చిన బై­క­ర్‌ శి­వ­శం­క­ర్‌­పై అతని స్నే­హి­తు­డు ఎర్రి­స్వా­మి ఉలిం­ద­కొండ పీ­ఎ­స్‌­లో ఫి­ర్యా­దు చే­శా­డు. పో­లీ­సు­లు పలు సె­క్ష­న్ల కింద కేసు నమో­దు చే­శా­రు. శి­వ­శం­క­ర్‌ ని­ర్ల­క్ష్యం వల్లే బై­క్‌ డి­వై­డ­ర్‌­ను ఢీ­కొ­ట్టి­న­ట్లు ఫి­ర్యా­దు­లో ఎర్రి­స్వా­మి పే­ర్కొ­న్నా­డు. ‘‘బై­క్‌ డి­వై­డ­ర్‌­ను ఢీ­కొ­ట్ట­డం­తో ఇద్ద­రం పడి­పో­యాం. శి­వ­శం­క­ర్‌ ఘట­నా­స్థ­లి­లో­నే మృతి చెం­దా­డు. మృ­త­దే­హా­న్ని పక్క­కు తీ­సేం­దు­కు యత్నిం­చా. మా బై­క్‌­ను ఓ వా­హ­నం ఢీ­కొ­ట్ట­గా రో­డ్డు మధ్య­లో­కి వచ్చిం­ది. అనం­త­రం వే­మూ­రి కా­వే­రి ట్రా­వె­ల్స్‌ బస్సు బై­క్‌­ను లా­క్కె­ళ్లిం­ది. దీం­తో బస్సు­లో మం­ట­లు చె­ల­రే­గి ప్ర­మా­దం జరి­గిం­ది’’ అని వి­వ­రిం­చా­డు. బై­క­ర్‌, మృ­తు­డు శి­వ­శం­క­ర్‌ నుం­చి సే­క­రిం­చిన నమూ­నా­ల్లో మద్యం ఆన­వా­ళ్లు ఉన్న­ట్లు ఫో­రె­న్సి­క్ సై­న్స్ ల్యా­బొ­రే­ట­రీ ని­వే­దిక ని­ర్ధ­రిం­చింది.


Tags:    

Similar News