AADHAR: "ఆధార్" డాక్యుమెంట్ల అప్లోడ్ గడువు పెంపు
2026 జూన్ 14 వరకు పెంచిన యూఐడీఏఐ;
ఆధార్ డిటెయిల్స్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. ముందుగా జూన్ 14, 2025తో ముగియాల్సిన ఈ అవకాశాన్ని 2026 జూన్ 14 వరకు పెంచినట్లు యూఐడీఏఐ ప్రకటించింది.
ఎవరికీ ఇది ఉపయోగపడుతుంది?
ఈ అవకాశం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది ఆధార్ హోల్డర్లకు లాభం చేకూరనుంది. వివాహం, ఉద్యోగ మార్పులు, విద్యలక్ష్యాలు వంటి కారణాలతో చిరునామా మారినవారు, అలాగే ఆధార్ తీసుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు గడిచినవారు తమ వివరాలను మార్చుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా ఉంది.
ఏం అప్లోడ్ చేయాలి?
ఆధార్ డేటాను నవీకరించేందుకు గుర్తింపు రుజువు (PoI) మరియు చిరునామా రుజువు (PoA) పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
గతంలో ఎలా ఉండేది?
అదే పని చేయడానికి మునుపు ఆధార్ సెంటర్లలో ₹50 రుసుము చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ సేవను ఉచితంగా ఆన్లైన్లో చేసుకునే వీలుంది.
ఇలా అప్డేట్ చేయడం ఎలా?
UIDAIఅధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in) లోకి వెళ్లండి.
మీ ఆధార్ నంబర్తో లాగిన్ అయ్యి, ఓటీపీ ద్వారా లాగిన్ చేయండి.
మీ ఆధార్ ప్రొఫైల్ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
వాటిలో సవరణలు అవసరమైతే చేసి లేదా సరైందని నిర్ధారించుకొని 'Next' క్లిక్ చేయండి.
డ్రాప్డౌన్ మెనూ నుండి సరైన PoI/PoA డాక్యుమెంట్లు ఎంచుకోండి.
స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేసి submit క్లిక్ చేయండి.
మీకు 14 అంకెల 'అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)' వస్తుంది.