APOLLO:అపోలో హాస్పిటల్స్ రికార్డు ఆదాయం
తొలిసారిగా రూ.20,000 కోట్ల మైలురాయిని దాటిన అపోలో హాస్పిటల్స్;
అపోలో హాస్పిటల్స్ గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రికార్డు స్థాయి ఆదాయాలను సాధించి, తొలిసారిగా రూ.20,000 కోట్ల మైలురాయిని దాటింది. ఏకీకృత ఖాతాల ప్రకారం సంస్థ మొత్తం ఆదాయం రూ.21,794 కోట్లను అందుకుంది. వార్షిక నికర లాభం రూ.1,446 కోట్లు నమోదు కాగా, షేర్పై లాభం (EPS) రూ.100.56గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఆదాయం 14% మరియు నికర లాభం 61% పెరుగుదల నమోదైంది. మార్చి త్రైమాసికంలో సంస్థ రూ.5,592 కోట్ల ఆదాయం, రూ.389.7 కోట్ల నికర లాభం సాధించింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే వరుసగా 13% మరియు 54% పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో వైద్య సేవల ద్వారా రూ.11,000 కోట్ల ఆదాయం పొందింది అపోలో. యాజమాన్యం చివరగా ఒక్కో షేరుకు రూ.10 తుది డివిడెండ్ ప్రకటించింది..
ఆసుపత్రి పడకల విస్తరణకు భారీ పెట్టుబడులు
అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆసుపత్రి పడకల సంఖ్యను వేగంగా పెంచుతోంది. బెంగళూరులో సర్జాపూర్లో 700 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి ఏర్పాటు చేస్తుంది. ఇదిలా ఉంటే, బెంగళూరులో మొత్తం పడకల సంఖ్య 1,500కు పెరుగుతుంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్లో కూడా అదనంగా 160 పడకలు కల్పించనున్నారు. గచ్చిబౌలిలో కొత్త ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నందున, మొత్తంగా హైదరాబాద్లో పడకల సామర్థ్యం 1,400కు చేరనుంది. నాలుగు సంవత్సరాల్లో మొత్తం 4,300 పడకలను ఏర్పాటు చేయడానికి రూ.8,000 కోట్ల పెట్టుబడి అవసరమని అపోలో పేర్కొంది. ఇందులో రూ.2,000 కోట్ల ఖర్చు ఇప్పటికే జరిగినది.