MUSK: ఒక్క "సారీ “తో మస్క్‌కు రూ.1600 కోట్ల లాభం

మస్క్ పోస్ట్ తో మళ్లీ పెరిగిన సంపద;

Update: 2025-06-13 05:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని ఎలాన్ మస్క్ 'ఎక్స్'లో పోస్ట్ చేయడంతో ఆయన నికర సంపద రాత్రికి రాత్రే రూ. 1600 కోట్లకు పైగా పెరిగింది. ట్రంప్ కూడా క్షమాపణలను అంగీకరించారు. గతంలో వారి విభేదాల కారణంగా టెస్లా షేర్లు కుదేలయ్యాయి. ఈ క్షమాపణ మస్క్ కంపెనీ షేర్లు తిరిగి పుంజుకునేందుకు దోహదం చేసింది. **కేవలం ఒక్క 'సారీ' పోస్ట్‌తో ట్రంప్‌తో సయోధ్యకు సిద్ధమవడమే కాకుండా.. ఈ ఒక్క మాటతోనే ఆయన సంపద కూడా అమాంతం పెరిగింది. మస్క్ ఈ పోస్ట్ చేసిన తర్వాత ఆయన నికర సంపద.. ఏకంగా 191 మిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 1600 కోట్లకు పైమాటే. ఇది మస్క్ వ్యాపార చతురతకు, మార్కెట్‌పై ఆయన మాటల ప్రభావానికి నిదర్శనం అని అర్థమవుతోంది. "అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా కొన్ని పోస్టులపై చింతిస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి" అని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఆశ్చర్యకరంగా, ట్రంప్ కూడా మస్క్ క్షమాపణలను అంగీకరించినట్లు వైట్‌హౌస్ ధ్రువీకరించింది. ఈ సానుకూల పరిణామాలతో అమెరికా మార్కెట్లు కూడా సానూకూల దృక్పథంలోనే కదలాడాయి. మస్క్ కంపెనీల షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద కూడా పెరిగింది.

Tags:    

Similar News