OIL PRICES: బంగాళాఖాతంలో చమురు విప్లవం
భారత ఇంధన రంగంలో చారిత్రక మైలురాయి... అండమాన్-నికోబార్ బేసిన్లో 'గయానా-సైజ్' చములు నిల్వలు;
భారత ఇంధన రంగంలో ఓ చారిత్రక మైలురాయి ఆవిష్కరించారు. బంగాళాఖాతం ఆగ్నేయాన అండమాన్-నికోబార్ బేసిన్లో 'గయానా-సైజ్' చమురు, సహజ వాయువు నిల్వలు కనుగొన్నారు. ఇది ఒక వ్యూహాత్మక ఘట్టం. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, విదేశాంగ విధానంపై, ఇంధన భద్రతపై, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై పడనుంది.
కొత్త కేంద్రంగా భారత సముద్రాలు
ఈ ఆవిష్కరణ గయానాలో గతంలో కనుగొన్న భారీ నిల్వలకు సమానంగా ఉండటంతో, ప్రపంచ ఆసక్తి భారత్ వైపు మళ్లుతోంది. ₹160 లక్షల కోట్ల (అంటే సుమారు $20 ట్రిలియన్) విలువైన నిల్వలతో, ఇది భారత్ను గ్లోబల్ ఎనర్జీ మ్యాప్పై నిలబెడుతోంది. ఇప్పటికే 37 బావుల తవ్వకాలు పూర్తయ్యాయి. ఉత్పత్తి ప్రారంభ దశలోనే ఉండగా, ఇది దేశాన్ని చమురు దిగుమతిదారుడిగా కాకుండా ఎగుమతిదారుడిగా మారుస్తుందన్న అంచనాలు ఊపందుకున్నాయి.
వ్యూహాత్మకంగా కీలకమైన అండమాన్ బేసిన్
ఇది కేవలం ముడి చమురు ఆవిష్కరణ కాదు. అండమాన్ సముద్రం భౌగోళికంగా చైనా సముద్ర మార్గాలకు సమీపంలో ఉంది. భారత నావికాదళం పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో ఇంధన నిల్వలు కనుగొనబడటం వ్యూహాత్మకంగా గొప్ప ప్రాధాన్యత కలిగిన విషయం. ఇది ఇండియా కోసం డిఫెన్స్ ఎకనామిక్స్కు కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఇంధన దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి, ఇప్పుడు స్వయం సమృద్ధి సాధ్యమవుతోంది. ఈ ఆవిష్కరణతో దేశీయ ఇంధన వినియోగాన్ని తీరుస్తూ, ఎగుమతులకు దారితీయగలుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2027 నాటికి 2.45 లక్షల బ్యారెల్ల ముడి చమురు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇంధన రంగంలో విదేశీ ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు.
సాంకేతికత, భాగస్వామ్యం, భవిష్యత్తు
ONGC, OIL వంటి సంస్థలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, లోతైన సముద్రాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నాయి. ఇది మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించడంలో, విదేశీ సాంకేతిక భాగస్వామ్యాలను ఆకర్షించడంలో కీలకంగా మారుతోంది. దీన్ని ఓ 'Energy Silicon Valley'గా అభివృద్ధి చేసే అవకాశాలను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి అన్వేషించాలి. ఈ విజయాన్ని కేవలం ఆర్థిక లాభంగా కాకుండా, దేశ భవిష్యత్తు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారత ప్రభావం పెంచే అవకాశంగా చూడాలి. గయానా-సైజ్ నిల్వలు భారతీయుల జీవితాల్లో ఒక కొత్త శక్తిని నింపుతాయి. ఇది "విశ్వగురు భారత్" దిశగా తీసుకెళ్లే మరో మెట్టుగా మిగిలిపోతుంది. చమురు ధర ఇప్పటికే పెరుగుతోంది. దాని రవాణాను మరింత పరిమితం చేస్తూ హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? అరేబియా ద్వీపకల్పానికి అవతలి వైపున ఉన్న యెమెన్లోని హౌతీలు ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తే? ఊహించలేని విధంగా భారీ ఎత్తున సమస్యలు సృష్టించగల ఇరాన్ మిత్రదేశం యెమెన్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం అనే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధం కారణంగా ఇప్పటికే కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావం పడుతుంది. పెరుగుతున్న చమురు ధరల వల్ల ప్రయోజనం పొందుతున్న ఏకైక వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్ అని మనం మర్చిపోకూడదు.