GST: చిక్కుల్లో పడ్డ ఔషధాలు, ట్రాక్టర్లు
జీఎస్టీ శ్లాబ్లో 5%, 12%, 18%, 28%;
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పద్ధతిలో 12 శాతం పన్ను శ్లాబ్ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నప్పటికీ, ఔషధాలు, ట్రాక్టర్లు ఈ ప్రక్రియలో పెద్ద సవాలుగా మారాయి. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబ్లో 5%, 12%, 18%, 28% ఉన్నాయి. వాటిలో 12 శాతం రేటు ఔషధాలు, ట్రాక్టర్లు, డయాగ్నొస్టిక్ కిట్లు, వెటర్నరీ డ్రగ్స్, సర్జికల్ డ్రెసింగ్స్ వంటి అవసరమైన ఉత్పత్తులపై వర్తిస్తోంది. అయితే 12% శ్లాబ్ను తొలగిస్తే, వాటిని 5% లేదా 18% శ్లాబ్లలోకి మార్చాల్సి ఉంటుంది. 18% రేటు ఆరోగ్య, వ్యవసాయ రంగాలపై భారం: ఇది ప్రజారోగ్యం, రైతులపై వ్యయభారం పెంచుతుంది. అందుకే వీటిని 18% కింద చేర్చే అవకాశమే లేదు. 5% రేటు వల్ల ఆదాయ నష్టం ప్రభుత్వానికి రూ. 3,000-4,000 కోట్లు వరకు పన్ను ఆదాయ నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
ఇతర ఉత్పత్తులకు మార్పు సాధ్యం
12 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న ఇతర వస్తువులను 5% లేదా 18% శ్లాబ్లకు మార్చడంలో పెద్ద అడ్డంకులు లేవు. కానీ ఔషధాలు, ట్రాక్టర్లు విషయంలో సమస్య చిక్కుముడిగా మారింది.
ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి?
విలాసవంత వస్తువులపై పన్ను పెంపు హై-ఎండ్ షూస్ వంటి వస్తువులపై జీఎస్టీ పెంచడం ద్వారా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వ భావన. అయితే వీటిని కొనేవారి సంఖ్య తక్కువగా ఉండటంతో, ఈ మార్గం సరిపోదనే అభిప్రాయం ఉంది.
ట్రాక్టర్లకు ప్రత్యేక మినహాయింపు
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా, ట్రాక్టర్లను పూర్తిగా జీఎస్టీ మినహాయితు కిందకు చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ట్రాక్టర్ల తయారీలో వాడే ముడి సరుకులపై ఇప్పటికే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు.
ట్రాక్టర్లకు ప్రత్యేక మినహాయింపు
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా, ట్రాక్టర్లను పూర్తిగా జీఎస్టీ మినహాయితు కిందకు చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ట్రాక్టర్ల తయారీలో వాడే ముడి సరుకులపై ఇప్పటికే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు. మరోవైపు.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు సైతం జీఎస్టీ మండలి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపులు సహా ఇతర అంశాలపై తమ స్పందన తెలియజేయాలని గత డిసెంబర్, 2024 కౌన్సిల్ సమావేశంలోనే ఆర్థిక శాఖ కోరింది.