Jio LapTop: సూపర్ ఆఫర్.. రూ.15వేలకే ల్యాప్‌టాప్

Jio LapTop: బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ తీసుకొచ్చింది టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియోబుక్ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.15,799గా నిర్ణయించింది.

Update: 2022-10-22 07:42 GMT

Jio LapTop: బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ తీసుకొచ్చింది టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియోబుక్ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.15,799గా నిర్ణయించింది. బ్యాంక్ ఆఫర్‌లు లాంటివి ఏమైనా ఉంటే ఇంకా తక్కువ ధరకే ల్యాప్‌టాప్ మీ సొంతమవుతుంది.

ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్, 4జీ సిమ్‌ సపోర్ట్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. JioOS ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు ఆఫర్లు అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.

జియోబుక్ స్పెసిఫికేషన్స్

11.6 అంగుళాల డిస్‌ప్లే

1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్

Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్

2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ (128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం

2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్‌తో వస్తుంది. 

Tags:    

Similar News