Mahindra Electric Scooter: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ త్వరలో మార్కెట్లోకి.. ఫీచర్లు, ధర చూస్తే..

Mahindra Electric Scooter: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులను ఆకర్షించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

Update: 2022-10-27 06:33 GMT

Mahindra Electric Scooter: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులను ఆకర్షించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ 'ప్యూజో కిస్బీ' త్వరలో దేశీయంగా విడుదల కానుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కిస్బీ ధర రూ. 1 లక్ష ఉంటుందని అంచనా. దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా, ఇది మహీంద్రా ఈ-స్కూటర్ కిస్బీ (మహీంద్రా ఈ స్కూటర్), ఈథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

1.6kWh 48V సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. కిస్బీ గరిష్ట వేగం గంటకు 42 కి.మీ మైలేజీ అందిస్తుంది.

కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

ఏథర్ 450X EVలో ఉన్న అదే హైటెక్ ఫీచర్లను జోడించినట్లు కనిపిస్తోంది. స్కూటర్‌లో ట్యూబులర్ స్టీల్ ఛాసిస్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, 14-అంగుళాల వీల్స్, ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

Tags:    

Similar News