MIYAWAKI: మియావాకి ఫారెస్ట్‌ను విస్తరిస్తున్న రియల్టీ కంపెనీ

ప్రముఖ ఎకో రియల్టీ సంస్థ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ మరో మైలురాయి నమోదు;

Update: 2025-06-03 06:00 GMT

ప్రపంచంలో అతిపెద్ద మియావాకి ఫారెస్ట్‌ను విస్తరిస్తున్న స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రముఖ ఎకో రియల్టీ సంస్థ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ మరో మైలురాయిని నమోదు చేయబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి ఫారెస్ట్ విస్తరణలో భాగంగా, ఈ సంస్థ తమ ప్రముఖ గ్రీన్‌ లివింగ్ ప్రాజెక్ట్ 'వుడ్స్ శంషాబాద్' రెండో దశను ప్రారంభించనుంది. ఈ విస్తరణ ద్వారా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని సంస్థ అంచనా వేస్తోంది.

మియావాకి పద్ధతిలో పచ్చదనం

ఈ ప్రాజెక్ట్‌లో జపాన్‌ పర్యావరణ శాస్త్రవేత్త అక్సిరో మియావాకి అభివృద్ధిచేసిన మియావాకి అటవీకరణ పద్ధతిని అనుసరిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ప్రాదేశిక మొక్కలు నాటడం, బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఈ విధాన లక్ష్యం. ప్రాజెక్ట్ మొదటి దశలో ఇప్పటికే 4,50,000 మొక్కలు/చెట్లు నాటారు. ఇది పూర్తిగా స్వయం సమృద్ధిగా మారిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు రెండో దశలో 100 ఎకరాల్లో విస్తరించనున్నారు.

ఫేజ్ 2 లక్ష్యాలు:

150 కొత్త స్థానిక వృక్ష జాతులు, 141 పక్షి జాతులకు ఆశ్రయం, 126 పండ్ల మరియు పుష్పించే మొక్కల పెంపకం, మరింత సుస్థిర జీవన వాతావరణం ఈ విస్తరణపై స్పందించిన స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ “ఫేజ్ 1లో మంచి స్పందన లభించింది. ఇది సుస్థిర జీవన శైలిపై పెరుగుతున్న ప్రజల ఆసక్తిని స్పష్టంగా చూపుతోంది. ఫేజ్ 2 ద్వారా వ్యక్తులు, కుటుంబాలు రోజు జీవనంలో ప్రకృతిని మరింత అనుభవించేందుకు అవకాశాలు కలుగుతాయి.” అన్నారు. వుడ్స్ శంషాబాద్ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణతో పాటు, మోడర్న్ లివింగ్‌కి కావలసిన సదుపాయాలు కలగలిపేలా రూపుదిద్దుకుంటోంది. భారత్‌లో సుస్థిర నివాస ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్‌కి ఇది ఓ సమర్ధత ఉత్పత్తిగా నిలవనుంది.

Tags:    

Similar News