మార్కెట్లో మరో క్రేజీ ఎలక్ట్రిక్ బైక్.. రివోల్ట్ ఆర్వి 400.. నిమిషాల్లోనే బుకింగ్స్
Revolt Motors Rv400: రెండోసారి కూడా RV400 ఎలక్ట్రిక్ బైక్ నిమిషాల్లో అమ్ముడైంది.;
Revolt Motors Rv400: ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అత్యధికంగా డిమాండ్ ఉంది. మొదటి సారి మార్కెట్లో ప్రవేశపెట్టిన వెంటనే వాహన ప్రియులను ఆకర్షించింది. కొద్ది రోజుల్లోనే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి ప్రముఖ షోరూముల్లు. ఇప్పుడు రెండవ రౌండ్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మరోసారి తన ఆర్వి 400, ఆర్వి 300 ఎలక్ట్రిక్ బైక్ల యొక్క అన్ని యూనిట్లను విక్రయించినట్లు రతన్ఇండియాకు చెందిన రివోల్ట్ మోటార్స్ (రివోల్ట్ మోటార్స్) గురువారం ప్రకటించింది. మొదటి రౌండ్ బుకింగ్ ప్రారంభించినప్పుడు, అన్ని యూనిట్లు రెండు గంటల్లో మెరుపు వేగంతో అమ్ముడయ్యాయి.
భారత మార్కెట్లో రెండు ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తుంది. కానీ అది తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంస్థ యొక్క RV400 భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ బైక్. RV400 టాప్ ఎండ్ వేరియంట్, RV300 బేస్ వేరియంట్. ఈ భారతీయ సంస్థ 2019 లో తన ఉత్పత్తులను ప్రారంభించింది. అప్పటి నుండి భారీ డిమాండ్ ఉన్నందున దాని బుకింగ్స్ చాలా త్వరగా ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ను మొదటి రౌండ్లో రూ .50 కోట్ల అమ్మిన మార్కెట్ల జరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఇంతకుముందు బుక్ చేసుకున్న లక్కీ కస్టమర్లకు ఆర్వి 400 ఎలక్ట్రిక్ బైక్ను డెలివరీ చేయడం ప్రారంభించింది.