SBI: హోమ్లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ
రుణ గ్రహీతలకు ఎస్బీఐ శుభవార్త;
భారత ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ గ్రహీతలకు గుడ్న్యూస్ చెప్పింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హోమ్లోన్లపై వడ్డీని తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR) రేటులో 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి రానునున్నాయి. తాజాగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి తీసుకురావడంతో, దాన్ని అనుసరించి ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.
అమృత్ వృష్టి'పై వడ్డీ రేట్ల మార్పులివే
"అమృత్ వృష్టి" పథకం 444 రోజుల కాలపరిమితితో ఉన్న ప్రత్యేక పథకం. ఇక్కడ వడ్డీ రేట్లు ఏకంగా 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. సాధారణ పౌరులకు గతంలో వార్షిక ప్రాతిపదికన 6.85 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 6.60 శాతానికి తగ్గింది. స్కీమ్ ప్రారంభంలో వడ్డీ రేటు ఏకంగా 7.25 శాతంగా ఉండేది. సీనియర్ సిటిజెన్లకు చూస్తే ఇప్పుడు వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. దీనికి ముందు 7.35 శాతం, అంతకుముందు 7.75 శాతంగా ఉండేది. సూపర్ సీనియర్ సిటిజెన్లకు (80 ఏళ్లు, ఆపైన).. సీనియర్ సిటిజెన్స్ కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ వస్తాయి.
హోమ్ లోన్ రేట్లలో తగ్గింపు
ఎస్బీఐ తన ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR)ను 8.65% నుంచి 8.15%కి తగ్గించింది. ఇది జూన్ 15, 2025 నుండి అమల్లోకి రానుంది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి మరియు ఇప్పటికే రుణాలు తీసుకున్నవారికి ఈ తగ్గింపు ప్రయోజనం చేకూరుతుంది. బ్యాంకులు ఎఫ్డీ రేట్లను తగ్గించడానికి ప్రధాన కారణం, ఆర్బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించడం. రెపో రేటు తగ్గితే, బ్యాంకులు ఆర్బిఐ నుంచి తక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవచ్చు. కాబట్టి, డిపాజిట్లపై కూడా వడ్డీ తగ్గించుకుంటాయి. అమృత్ వృష్టి రేట్లు మారినప్పటికీ, ఎస్బీఐ ఇతర సాధారణ ఎఫ్డీ రేట్లలో ప్రస్తుతానికి మార్పు లేదు.