మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తను ఎంత బిజీగా ఉన్నాడో మొన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడు. ‘మళ్లీ ఎప్పుడు కలుస్తానో తెలియదు’ నన్ను మాట్లాడనివ్వండి అన్నాడు. అంటే అభిమానులను కూడా కలుసుకోలేనంత బిజీ అయిపోయాడన్నమాట. అతని వార్ 2 ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ మూవీలో నెగెటివ్ రోల్ చేశాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ షూటింగ్ సాగుతోంది. ఈ నెల 22నుంచి సెట్స్ లో అడుగుపెడతాడు ఎన్టీఆర్. ఈ లోగా ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ కు వెళ్లాడు. అయితే కొన్ని రోజులుగా దేవర 2 ఏమైంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు కళ్యాణ్ రామ్ ఆన్సర్ చెప్పాడు.
ఎన్టీఆర్ లైన్ అప్ లో దేవర 2 ఉంది. కానీ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా వచ్చాడు. దీంతో ముందు నెల్సన్ తో సినిమా పూర్తి చేసి ఆ తర్వాత దేవర 2కు వెళతాడు అనుకున్నారు. అయితే జైలర్ దర్శకుడిని ఇంకా వెయిట్ చేయిస్తున్నాడు ఎన్టీఆర్. దేవర 2 తర్వాతే అతని సినిమా ఉంటుందని చెప్పాడు కళ్యాణ్ రామ్. అంటే డ్రాగన్ తర్వాత కొరటాల శివతో దేవర 2 ఉంటుందన్నమాట.
దేవర కంటే దేవర 2 కథ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ముందు నుంచీ చెబుతున్నాడు ఎన్టీఆర్. కానీ ఎందుకో ప్రస్తుతం అతని లైనప్ తో పాటు కాంపిటీషన్ కూడా చూసినప్పుడు కొరటాల కంటే నెల్సన్ తో అయితేనే బెటర్ అనే భావన అభిమానుల్లో ఉంది. అదీ కాక ప్రశాంత్ నీల్ తో విస్ఫోటనం లాంటి సినిమా వస్తుంది. అలాంటి మూవీ తర్వాత దేవర 2 కంటే నెల్సన్ తో చేస్తేనే ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు అనుకుంటున్నారట. అయినా అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా.. వాళ్లు చేయాల్సింది చేస్తారు అంతే. సో.. దేవర 2 తర్వాతే నెల్సన్ తో సినిమా ఉండబోతోందన్నమాట.