బాలీవుడ్ అగ్రహీరోలు దక్షిణాది దర్శకుల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్ (అట్లీ), రణబీర్ కపూర్ యానిమల్ (సందీప్ రెడ్డి వంగా) సినిమాలతో భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో అమీర్ ఖాన్ చేరనున్నారు. కొంతకాలంగా ఆయన లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇది నిజమే అని అమీరూ అంటున్నారు.
మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ హిట్స్ ఇచ్చిన లొకేష్తో సినిమాలు చేయాలని చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్ లో లోకేష్ తో సినిమా ఉంటుందని అమీర్ చెప్పారు. లోకేష్ కనగరాజ్ తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఇది ఒక భారీ యాక్షన్ సినిమా అంటూ, ఈ సినిమా 2026లో ప్రారంభం కానుందని వెల్లడించారు. ‘సితారే జమీన్ పర్' సినిమా విడుదలైన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. లోకేష్ కనగరాజ్ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించనున్నట్టు అమీర్ తెలిపారు. 'మహాభారతంపై కూడా పనిచేస్తున్నానని తెలిపారు.