AR Rahman's Concert Row: నా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.. కానీ : కార్తీ
రెహమాన్ సంగీత కచేరి గందరగోళంపై స్పందించిన నటుడు కార్తీ
సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ చెన్నైలోని పనైయూర్లోని ఆదిత్యరామ్ ప్యాలెస్లో జరిగిన 'మరకుమా నెంజమ్' అనే తన కచేరీ కోసం ACTC ఈవెంట్స్తో జతకట్టారు. అయితే ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ట్రాఫిక్ రద్దీ, తొక్కిసలాటతో పిల్లలతో పాటు చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రేక్షకులు.. ఈ కన్సర్ట్ నిర్వాహకులపైనా, రెహమాన్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టడంతో.. రెహ్మాన్ తో పాటు నిర్వాహకులు కూడా ఆడియెన్స్ కు క్షమాపణలు చెప్పారు. అంతే కాకుండా షో నుంచి వెళ్లిపోయిన వారికి టిక్కెట్ మొత్తాన్ని వాపసు చేస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ కుమార్తెలు రహీమా, ఖతీజా తమ తండ్రిని సమర్థించేందుకు సోషల్ మీడియాకు వెళ్లారు.
ఖతీజా. రహీమా AR రెహమాన్ గతంలో తన అభిమానులు, సాధారణ ప్రజల మధ్య ఎలా ఉండేవారో పోస్ట్ను షేర్ చేసారు. 2016, 2018, 2020, 2023లో జరిగిన అతని మునుపటి సంగీత కచేరీల వివరాలను, సామాజిక కార్యక్రమాలకు వారు ఎలా విరాళంగా అందించారు అనే వివరాలను తెలియజేస్తూ, స్వరకర్త గురించిన ఇన్ఫోగ్రాఫిక్ను కూడా వారు పంచుకున్నారు.
ఊహించిన దాని కంటే దాదాపు 15వేల మంది ఎక్కువ ప్రజలు అక్కడకు చేరుకున్నారని తాంబరం నగర పోలీసు కమిషనర్ ఎ అమల్రాజ్ చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులతో విచారణ జరుపుతామని తెలిపారు. 25,000 కుర్చీలు వేసినప్పటికీ, 35,000 నుండి 40,000 మంది ప్రజలు తరలిరావడంతో "ఊహించిన దానికంటే ఎక్కువ" గుంపు చేరింది. పోలీసులు వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించకుండా చాలా మందిని ఆపాల్సి వచ్చినప్పటికీ, ప్రజల సంఖ్య ఎలా అనేక రెట్లు పెరిగిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.
కచేరీ జరిగిన స్థలం "ప్రైవేట్ ల్యాండ్" అని ఓ అధికారి విలేకరులతో అన్నారు. సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో సహా ఇతర సమస్యలను నిర్వాహకులతో చర్చిస్తామన్నారు. అంతకుముందు వర్షాల కారణంగా, పార్కింగ్ను ఉపయోగించుకోలేకపోయారు. దీంతో చాలా మంది తమ వాహనాలను రహదారిపై పార్క్ చేయడంతో రద్దీ ఏర్పడిందని ఆయన తెలిపారు. "కేవలం పోలీసు ఉనికి కారణంగా శాంతిభద్రతలు (సమస్యలు) లేదా అవాంఛనీయ సమస్యలు జరగలేదు" అని ఆయన అన్నారు.
ఈ కచేరీకి కార్తీ కుటుంబం హాజరయ్యారు
సెప్టెంబర్ 12న, తన కుటుంబ సభ్యులు కచేరీకి హాజరయ్యారని సినీ నటుడు కార్తీ X ద్వారా తెలియజేశాడు. కార్యక్రమ నిర్వాహకులు బాధ్యత వహించాలని ఆయన ఉద్ఘాటించారు. "మేము ఇప్పుడు 3 దశాబ్దాలకు పైగా రెహమాన్ సర్ని తెలుసు, అప్పట్నుంచి ఆయన్ను మేం ప్రేమిస్తున్నాము... కచేరీ సమయంలో జరిగింది దురదృష్టకరం. అయితే, సార్ దాని వల్ల విపరీతంగా ప్రభావితమవుతాడు. ఈ గందరగోళంలో నా కుటుంబం కూడా ఉంది. కానీ నేను రెహమాన్ సర్ తో ఉంటాను. ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాను. రెహమాన్ సార్ ఎల్లప్పుడూ తన ప్రేమను అందరికీ అందించారు. కాబట్టి ద్వేషం కంటే ప్రేమను ఎంచుకోవాలని అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాను" అని కోరారు. దాంతో పాటు #LoveAboveHate అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
We have known and loved Rahman sir for more than 3 decades now... What happened during the concert was unfortunate. However, knowing sir he would be immensely affected by it. My family too was at the concert amid the chaos but I stay with #ARRahman sir and I hope the event…
— Karthi (@Karthi_Offl) September 12, 2023