ఐకానిక్ స్టార్ హీరో అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. భారీ ప్రాజెక్టుతో నిర్మించబోయే ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ, అట్లీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికీ దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వర్క్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ కు సన్నద్ధం కానుంది. ఇందులో భాగంగానే తొలి షెడ్యూల్ ను ముంబయిలో చిత్రీకరించనున్నారట. మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత వీఎఫ్ఎక్స్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోది. ఇందుకోసం టీమ్ అమెరికా వెళ్లనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాణసంస్థపై భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె బన్నీకి జోడీగా కనిపించనున్నారు. సమాంతర ప్రపంచం, పునర్జన్మల న్సెప్ట్ ముడిపడి ఉండే సైన్స్ఫాక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది.