Chiranjeevi : గాల్లో చిరంజీవి వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. నాగార్జున, మహేశ్ కుటుంబాల సర్ ప్రైజ్

Update: 2025-02-21 07:45 GMT

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును విమానంలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. వీరితోపాటు అక్కినేని నాగార్జున, నమ్రత శిరోద్కర్, అమల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చాలు ఇచ్చి విషెస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరలవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో నమ్రత కనిపిస్తుండగా.. మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. దీంతో మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

"దుబాయ్ మార్గమధ్యలో కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. సురేఖ నా కలల జీవిత భాగస్వామి. ఆమెలాంటి సతీమణి దొరకడం నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను.. ఆమె నా బలం. ఆమె ఉనికి నిరంతరం నాకు ఓదార్పునిస్తుంది. అద్భు తమైన ప్రేరణనిస్తుంది. ఆమె నా మోటివేటర్. థాంక్యూ సోల్ మేట్. మీ అద్భుతమైన శుభాకాంక్షల కోసం స్నేహి తులు, అభిమానులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషు లందరికీ ధన్యవాదాలు. ఆశీర్వదించండి. " అంటూ చిరు తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి, సురేఖ దంపతులకు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News