నందమూరి నటసింహం బాలయ్య -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మూడు ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాన్ని సాధించాయి. దీంతో 'అఖండ 2 - తాండవం'పై భారీ అంచనాలు నెలకొన్నా యి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ మూవీపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో నటి స్తోందని టాక్. పైగా రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఎన్టీఆర్ బయోపిక్'లో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించింది. కాగా అఖండ - 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తు న్నారు. ఈచిత్రంపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఇందులో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది.