టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కసిరెడ్డి భాస్కరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి N- కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కసిరెడ్డి ఫిర్యాదులో కోరారు. ఇటీవలే నాగార్జున ఎన్ కన్వెషన్ను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే తాను ఎలాంటి భూమి కబ్జా చేయలేదని నాగార్జున ప్రకటించారు. హైడ్రా కూల్చివేతలపై కోర్టుకు వెళ్లారు. ఎన్ కన్వెషన్ విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. ఈ వివాదాలన్ని సాగుతుండగానే నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు రావడం ఆసక్తిగా మారింది.