హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. రిసార్ట్పై దాడులు చేసిన పోలీసులు అక్కడ విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న 48 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 9 మందికి గంజాయి పాజిటివ్ తేలింది. ఈ ఘటనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పార్టీలో పలువురు ఫోక్ సింగర్స్ పాల్గొన్నారు.
ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్వోటీ పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. పార్టీకి వచ్చిన వారిలో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.