Vijay Devarakonda : విజయ్ ని కావాలనే టార్గెట్ చేశారా..?

Update: 2025-06-23 09:00 GMT

టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండను కావాలనే టార్గెట్ చేశారా..? అంటే అవుననే వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం రెట్రో మూవీ ఫంక్షన్ లో పహల్గామ్ దాడులను ఉద్దేశిస్తూ.. అతను చేసిన కొన్ని వ్యాఖ్యలను చాలామంది విమర్శించారు. వందల యేళ్ల క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్టు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో ఈ పాకిస్తాన్ వాళ్లు అనే అర్థం వచ్చేలా అతను చేసిన మాటలను.. అతను ట్రైబ్స్ ను అవమానించాడు అని చెబుతూ విమర్శలు గుప్పించారు. అయితే దీనికి అతను అప్పుడే వివరణ ఇచ్చాడు. తన మాటల అర్థం వేరే అని. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని.. వందల యేళ్ల క్రితం అందరం ఆల్మోస్ట్ ట్రైబ్స్ గానే ఉన్నాం అనేలా వివరణ సాగింది. దీంతో ఆ గొడవ అప్పటికి సద్దుమణిగినట్టే అనుకున్నారు. బట్ తాజాగా అతనిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేస్ లు నమోదు చేయించారు కొందరు. అయితే విషయం జరిగి ఇన్ని నెలల తర్వాత కేస్ పెట్టడం చూస్తుంటే కొందరు కావాలనే అతన్ని టార్గెట్ చేశారా అనిపిస్తోందంటున్నారు చాలామంది.

నిజానికి విజయ్ దేవరకొండ పబ్లిక్ బిహేవియర్ పై కొన్ని విమర్శలున్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాడు. వీలైనంత పొలైట్ (అంతకు ముందు లేడు అని కాదు) గా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాడు. నిజానికి విజయ్ దేవరకొండను ఇండస్ట్రీలోనే ఒక వర్గం వారు టార్గెట్ చేశారు అనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. వాళ్లే ఇలా చేయించారు అనేది విజయ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోన్న మాట. ఇలాంటి కేస్ ల విషయంలో కాలయాపన చేసి పక్కాగా వచ్చారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఇంకేదో ఉంది అనే అనుమానాలు వస్తే తప్పేం కాదు. మరి ఈ కేస్ నుంచి విజయ్ దేవరకొండ ఎలా బయటపడతాడో కానీ.. అసలు కేస్ నిలబడుతుందా అనేది పెద్ద పాయింట్. ఏదేమైనా పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

Tags:    

Similar News