హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ గా అనిల్ కపూర్, అషుతోష్ రాణా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ యేడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటించిన సినిమా. ఆర్ఆర్ఆర్, దేవరతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాడు. అటు హృతిక్ కూడా ఈ మూవీతోనే ప్యాన్ ఇండియా మార్కెట్లోకి వస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ మూవీ తెలుగు రైట్స్ ను నాగవంశీ తీసుకున్నాడు. 80 కోట్లు అని చెప్పారు. ఇక రిలీజ్ కు నెల రోజులు పైనే ఉన్నా.. అప్పుడే ఈ మూవీ రికార్డుల వేట మొదలైంది అని చెబుతున్నారు. అది కూడా థియేటర్స్ కౌంట్ నుంచి స్టార్ట్ కాబోతోంది.
ఇప్పటి వరకూ ఇండియాలో అత్యంత ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమా ‘2.0’. శంకర్, రజినీకాంత్ కాంబోలో ఆల్రెడీ వచ్చిన రోబో బ్లాక్ బస్టర్ కావడం.. తర్వాత దానికి సీక్వెల్ లా ఇది కనిపించడంతో అప్పట్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఏకంగా 7 వేల 500 స్క్రీన్స్ లో విడుదల చేశారు. బట్ ఆ రేంజ్ కు తగ్గ రిజల్ట్ అయితే రాలేదు. అయినా అదో రికార్డ్. ఆ రికార్డ్ నే వార్ 2తో బద్ధలు కొట్టే ప్లాన్ లో ఉందట యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్. వార్ 2 చిత్రాన్ని 9వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయట. కాకపోతే వార్ 2 రిలీజ్ రోజునే అదే సూపర్ స్టార్ నటించిన కూలీ చిత్రం విడుదలవుతోంది. ఇందులో భారీ తారాగణం ఉంది. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో అంచనాలూ పీక్స్ లో ఉన్నాయి. సో.. 7,500 స్క్రీన్స్ రికార్డ్ ను బద్ధలు కొట్టడం అంత సులువేం కాదు. అదే టైమ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ను తక్కువ అంచనా వేయడానికీ లేదు.