Janhvi Kapoor : రెమ్యునరేషన్ పెంచేసిన జాన్వీ.. రూ. కోట్లు ఇవ్వాల్సిందేనట

Update: 2025-07-26 08:45 GMT

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. వరుస ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు బాలీవుడ్లోనూ.. ఇటు టాలీవుడ్లోనూ పలు మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ సినిమా సీక్వెల్ లోనూ నటించనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ పెద్దిలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. రెమ్యునరేషన్ విషయానికొస్తే.. దేవర మూవీకి రూ.5 కోట్లు అందుకున్న జాన్వీ.. పెద్ది సినిమాకు గాను రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రెండో చిత్రానికే కోటి రూపాయలు పెంచిందని సమాచారం. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలోని ఓ రోల్ కోసం మేకర్స్ ఇటీవల జాన్వీ కపూర్ ను సంప్రదించారట. దీంతో ఈ మూవీకి మరో కోటి పెంచేసి మొత్తంగా రూ.7 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట జాన్వీ. ఆమెను మూవీలోకి తీసుకుంటే.. ఉత్తదారిలోనూ ఉపయోగం అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే కాస్త రెమ్యునరేషన్ తగ్గించమని ఆమెతో చర్చలు జరుపు తున్నట్లు సమాచారం. కానీ ఈ భామ మాత్రం వెనక్కి తగ్గడం లేదని టాక్.

Tags:    

Similar News