Janvi Kapoor : పింక్ శారీలో జాన్వీ.. ఫొటోలకు పోజులు

Update: 2025-06-19 10:30 GMT

అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్. ట్రెడిషనల్ శారీలోను హృదయా ల్ని కొల్లగొట్టే వైబ్స్ ని తీసుకొచ్చిందీ అమ్మడు. లేత గులాబీ డిజైనర్ శారీలో మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది. హృదయాల్ని దోచుకునే ట్రెడిషనల్ డిజైనర్ చీరల్లో, కాంబినేషన్ ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. అలాంటి ఒక చీరందాన్ని పింక్ లో గుబులు పెంచింది. పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసే ఈ చీరను క్రిస్టలైన్ బార్డర్ తో అందంగా రూపొందించగా, ఎంపిక చేసిన బ్లౌజ్ పచ్చందంతో క్రిస్టలైన్ డిజైన్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ నెక్లెస్ ధగధగలు జాన్వీ అందాన్ని పదింతలు పెంచాయి. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ద చిత్రంలో నటిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తర్వాత తమిళ హీరో సూర్య సరసన ఓ చిత్రంలో జాన్వీ కపూర్ నటించనుందనే వార్తలొస్తున్నాయి. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Tags:    

Similar News