అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న లపతా లేడీస్ ఈ సారి జపాన్ అకాడమీ ఫిల్మ్ జ్ 2024 కు షార్ట్ లిస్ట్ అయ్యింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ కింద ‘ఓపెన్ హైమర్', 'పూర్ థింగ్స్', 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'సివిల్ వార్' వంటి హాలీవుడ్ సినిమాలకు అపతా లేడీస్ పోటీగా నిలిచింది. మార్చి 14న జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటించనున్నారు. నితానీ గోయల్, ప్రతిభారంతా, స్పర్మ్ శ్రీవాత్సవ ఛాయా కదమ్, రవి కిషన్ కీలక పాత్రల్లో కిరణ్ రావు ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందించా రు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్) వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ సినిమాగా నిలిచింది. 2025 ఆస్కార్కు మనదేశం నుంచి ఎంపికైన ఈ చిత్రం షార్ట్స్లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా గత ఏడాది అక్టోబరులో జపాన్లో విడుదలైంది.