ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్లలో ఒకటిగా మారింది ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎ స్ఎంబీ 29 మూవీ. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జక్కన్న తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మన ఇండియన్ సినిమా దగ్గర ఒక కొత్త విజువల్ ట్రీట్ ని అందించింది. ఇక ఇదే అనుకుంటే దీనికి మించిన ట్రీట్ మహేశ్ తో తీస్తున్న సినిమాకి రాజమౌళి ప్లాన్ చేశారట. ఈసారి దెబ్బకి వరల్డ్ వైడ్ గా తమ సినిమా కోసం మరోసారి మాట్లాడుకునే రేంజ్ లో ఔట్ పుట్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో వరల్డ్ షేక్ అయ్యేలా ఈ సినిమా విజువల్స్ ఉంటాయని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా ఇం ట్రడక్షన్ సీన్ కోసం జక్కన్న తదుపరి షెడ్యూల్ ను కెన్యా అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సీన్లో భారీ యాక్షన్ ఎలి మెంట్స్ ఉండబోతున్నాయట. కెన్యా లొకేషన్లు, ఫారెస్ట్ నేపథ్యం సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సీన్ కోసం భారీ వీఎఫ్ఎక్స్ టీమ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ క్రూ పనిచేస్తుందని టాక్.