బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ అభిమానికి సారీ చెప్పింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రీతి ట్విట్టర్లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మీరు బీజేపీలో చేరుతున్నారా? అని అడగ్గా.. 'సోషల్ మీడియాతో ఇదే సమస్య. ప్రతిఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను గతంలో చెప్పినట్లు ఆలయాలకు, కుంభమేళాలకు వెళ్తే దాని అర్థం బీజేపీలో చేరతానని కాదు. ఫారిన్ లో ఉన్న టైంలోనే దేశం విలువ నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్ ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నాను' అని పేర్కొంది. అయితే ఈ చిన్న ప్రశ్నకు ఇంత కఠినంగా ఆన్సర్ ఇవ్వాలా? అంటూ నెట్టింట ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా ప్రీతి అభిమానికి క్షమా పణలు చెప్పింది. ‘నా రిప్లై మీకు కఠినంగా అనిపిస్తే నన్ను మన్నించండి. మీ క్వశ్చన్ చూసి నేను అసహనానికి గురయ్యాను. నేను విదేశాల్లో ఉంటున్నందుకు నా పిల్లలు భారతీయతను మర్చిపోకూడదు కదా..! అందుకే వారికి దేశ గొప్పతనం తెలియాలని గుళ్లకు తీసుకెళ్తాను. దురదృష్టవశాత్తూ నేను ఈ విషయంలో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కొంటున్నాను. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకే అలా మాట్లాడాను. మీరంటే నాకు ఎప్పుడూ గౌరపమే' అని ఆ అభిమానికి క్లారిటీ ఇచ్చింది.