సినిమాలకు టైటిల్స్ నిర్ణయించడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ది శైలి ప్రత్యేకం. గతంలో ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇస్మార్ట్ శంకర్ వంటి టైటిల్స్ సినిమాలు అందించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఆయన తన కొత్త సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్స్ వేగంగా జరుగుతున్నాయి. నటుడిగా పేరున్న విజయ్ సేతుపతితో పూరి ఎలాంటి కథని అందించబోతున్నారు? అనే ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది. పూరికి ఈ సినిమా విజయ అవసరం. ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే నటించబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాధికా ఆప్టే స్థానంలో నటి నివేదా థామస్ నటించనున్నట్టు తెలిసింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమా చిత్రీకరణ ఇదే నెలలో ప్రారంభమవుతుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు తొలుత 'బెగ్గర్' అనే టైటిల్ పరిశీలించినట్టు తెలిసింది. తాజాగా 'భవతీ భిక్షాందేహి ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం ఉంది. లేదా ఇవి కాకుండా మరొక టైటిల్ కూడావారి ఆలోచనల్లో ఉన్నట్టు తెలిసింది.