ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడిగా నటించిన పుష్ప -2 సినిమా బాక్సఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సఫీసు బద్దలు కొడుతూ దూసుకెళ్లింది. ముఖ్యంగా నార్త్ లో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాకు మరో 20 నిమిషాలు ఫుటేజ్ అదనంగా జోడిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. విడుదలై ఐదవ వారంలో ఉంది. ఇది హిందీలో 3800 + కోట్ల క్లబ్లో చేరిన మొదటి డబ్బింగ్ వెర్షన్గా నిలిచింది, అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల మార్కును కూడా దాటింది. ఈనెల 11 నుంచి థియేటర్లలో ఈ చిత్రానికి రీలోడెడ్ వెర్షన్ జతచేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వీకెండ్ సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో పుష్ప 2 కలెక్షన్లు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.