ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో హవా కొనసాగిస్తుంది ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. టాలీవుడ్, బాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీబిజీగా మారింది. అయితే ఎంతటి స్టార్ యాక్టర్ అయినా ఒక్కోసారి పొరబాట్లు జరగడం కామన్. తర్వాత వీరిపై ట్రోల్స్ రావడం సాధారణమే. తాజాగా నేషనల్ క్రష్ రష్మికకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మిక తడబాటుకు గురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చివరికి సారీ చెప్పక తప్పలేదు. తనకు విజయ్ దళపతి అంటే ఇష్టమని.. ఆయన నటించిన గిల్లి మూవీని ఫస్ట్ టైం థియేటర్లో చూశానని తెలిపింది. పోకిరి సినిమాకు రీమేక్ అని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. నిజానికి ఇది ఒక్కడు మూవీకి రీమేక్. దీంతో ఇంటర్వ్యూలో తప్పు సమాధానం చెప్పడంతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఈ కన్నడ బ్యూటీ సారీ చెప్పాల్సి వచ్చింది.