పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న ( Rashmika Mandanna ) దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ను అందుకుందో తెలిసిందే. సౌత్లోనే కాకుండా ఈ అమ్మడు నార్త్ కూడా 'యానిమల్' సినిమాతో భారీ సక్సెస్ను అందుకుంది. దానితో ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.
తాజాగా రష్మిక నటిస్తున్న పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ రెయిన్ బో వంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఆ సమయంలోనే ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన అభిమానులను భయపెట్టేందుకు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఓ హార్రర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుందట రష్మిక. కాగా దర్శకుడు ఆదిత్య సత్పోదర్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేశారట.
దానితో ఈ ప్రాజెక్టుకి రష్మిక మందన్నను కన్ఫామ్ చేశారట మేకర్స్. ఇక ఈ మూవీను స్పై, భేడియా, ముంజ్యా వంటి హారర్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత దినేష్ విజయ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతే కాకుండా రష్మిక మందన్న ఎప్పుడు చూడని పాత్రలో ఈ చిత్రం ద్వారా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్' అనే టైటిల్ nu పరిశీలిస్తున్నారు. త్వరలో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.