ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఆసుపత్రి పాలయ్యాడు. నటుడిగా మారిన రాజకీయవేత్తను కోల్కతాలోని అపోలో ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. ఓ నివేదిక ప్రకారం, మిథున్ కి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మిథున్ చక్రవర్తి 1976 నుండి చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నాడు. జాతీయ అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను ఆయన అందుకున్నాడు. అతను డిస్కో డాన్సర్, జంగ్, ప్రేమ్ ప్రతిగ్యా, ప్యార్ ఝుక్తా నహిన్, మర్ద్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు.
ఇటీవల, మిథున్ 2024 పద్మభూషణ్ అవార్డుల గ్రహీతలలో ఒకరిగా పేరుపొందారు. ఈ సందర్భంగా స్పందించిన మిథున్.. నన్ను నిస్వార్థంగా ప్రేమించిన ప్రతి ఒక్కరికీ, నా శ్రేయోభిలాషులకు దీన్ని అంకితం చేస్తున్నాను. నాకు చాలా ప్రేమ, గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు”అని చెప్పారు. తన కుమారుడు నమాషి కూడా సోషల్ మీడియా ద్వారా తండ్రి గెలుపుపై స్పందించారు. చాలా ఆనందంగా ఉందని చెప్పారు.