Samantha : తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: సమంత

Update: 2025-02-24 09:30 GMT

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్ వంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని హీరోయిన్ సమంత చెప్పారు. ఇన్‌స్టాలో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. నెగటివ్ ఆలోచనలను అధిగమించేందుకు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తానని తెలిపారు. తెలుగులో సినిమాలు చేయాలని ఓ టాలీవుడ్ ఫ్యాన్స్ కోరగా తప్పకుండా మళ్లీ వస్తానని బదులిచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసినట్లు పేర్కొన్నారు.

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఇటీవల మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. 2024లో ఆ పోర్టల్​లో ఎక్కువగా సెర్చ్ చేసిన హీరో- హీరోయిన్ల లిస్ట్‌ ప్రకటించింది. ఆ లిస్టులో సమంత ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టాప్​లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ నిలిచారు.

ప్రస్తుతం సమంత ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’లో నటిస్తున్నారు. ‘తుంబాడ్‌’ ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు. ఇప్పటిదాకా దానిపై మరో అప్‌డేట్‌ రాలేదు.

Tags:    

Similar News